సమీక్ష రచన : విన్నకోట రవిశంకర్
శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో “కొయ్య కాలు” అనే కవిత ఉంది. ఈ కవితను ముందుమాటలో ప్రస్తావిస్తూ ఇస్మాయిల్ గారు ఇలా రాసారు - “కవిత్వం కవికి కొయ్యకాలు లాంటిది. తను కోల్పోయిన దేనికో substitute. తనను తాను తలక్రిందులుగా పాతుకుంటేనేకానీ అది చిగిర్చదు.” నారాయణస్వామి రెండో పుస్తకం “సందుక” చదివినప్పుడు వెంటనే నాకీ వాక్యాలు గుర్తుకువచ్చాయి. తను కోల్పోయినదానిని కవిత్వంతో భర్తీ చేసుకునే ప్రయత్నం ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. సందుక, అర్ర, ఊరి చెరువు ఏదైనా కోల్పోవడానికి ఒక ప్రతీక మాత్రమే. స్వామి తనను తాను తలక్రిందులుగా పాతుకోకపోయినా,తన ఊరినించి తెచ్చిన “చిన్నారి మొక్క”ను తనలో తలక్రిందులుగా పాతుకున్నాడు. దాని పూల ఎరుపుదనం నెత్తురులోకి చొచ్చుకొనిపోయి, శరీరమంతా వ్యాపించింది. అది బహుశ అతని కవిత్వమే కావచ్చు.




0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.